నిందితులను జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు: Bonda Uma
ABN , First Publish Date - 2022-06-09T22:53:12+05:30 IST
అమరావతి: వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితులను జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆరోపించారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ
అమరావతి: వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితులను జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆరోపించారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు పులివెందుల్లో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి కొలతలు వేశారని, పులివెందులలో అన్ని ఇళ్లుంటే.. జగన్, అవినాష్ రెడ్డి ఇళ్లనే ఎందుకు కొలతేశారు..? అని ప్రశ్నించారు. మరోవైపు వివేకా హత్య కేసులో సాక్షులను చంపేస్తారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. ‘‘హత్య కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న కటికం శ్రీనివాసరెడ్డి చనిపోయారు. వివేకా మృతదేహానికి కుట్లు వేసిన వైఎస్ జగన్ మామ గంగిరెడ్డి చనిపోయారు. గంగాధరరెడ్డి మృతి కూడా అంతు పట్టకుండా ఉంది. అవినాష్ రెడ్డి పేరు బయటకు రాకుండా ఉండడం కోసం గంగాధర రెడ్డిని చంపేశారని ప్రచారం జరుగుతోంది. గంగాధర రెడ్డి మృతదేహానికి ఎందుకు పోస్ట్ మార్టం జరపలేదు. భుజానెత్తుకుని మోసిన బాబాయిని చంపిన హంతకులను జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.’’ అని బోండా ఉమ ఆరోపించారు.