రాత్రి తాగడం, పగలు వాగడమే జోగి రమేష్‌కు తెలుసు: బోండా ఉమ

ABN , First Publish Date - 2022-04-23T17:16:36+05:30 IST

మంత్రి జోగి రమేష్‌పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాత్రి తాగడం, పగలు వాగడమే జోగి రమేష్‌కు తెలుసు: బోండా ఉమ

విజయవాడ: మంత్రి జోగి రమేష్‌పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాత్రి తాగడం, పగలు వాగడమే జోగి రమేష్‌కు తెలుసన్నారు. ఫుల్ బాటిల్ తాగి ఊగేవాడు కూడా తమ గురించి మాట్లాడేవాడా? అని మండిపడ్డారు. ముందు బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం మంత్రి తెలుసుకోవాలన్నారు. మంత్రి పదవి అంటే నోరేసుకుని వాగడం కాదన్నారు. గుడివాడ గూట్లే కూడా ఇలాగే వాగి అడ్రస్ లేకుండా పోయారన్నారు. ఇప్పుడు జోగి రమేష్ నోరు పారేసుకోవడం ప్రారంభించారన్నారు. ఎగిరెగిరి పడే వాళ్లు ఎంతో కాలం నిలవరని బోండా ఉమ అన్నారు.

Updated Date - 2022-04-23T17:16:36+05:30 IST