దుర్గమ్మ, కోటగడ్డ పెద్దమ్మలకు బోనాలు

ABN , First Publish Date - 2021-07-28T07:02:07+05:30 IST

పట్టణంలోని దుర్గమ్మ, కోట గడ్డపెద్దమ్మకు పలువురు మహిళలు బోనాలను సమర్పించారు.

దుర్గమ్మ, కోటగడ్డ పెద్దమ్మలకు బోనాలు

ధర్మవరం, జూలై 27: పట్టణంలోని దుర్గమ్మ, కోట గడ్డపెద్దమ్మకు పలువురు మహిళలు బోనాలను సమర్పించారు. దుర్గమ్మకు దుర్గానగర్‌ వాసులు, కోటగడ్డపెద్దమ్మకు యాదవవీధి వాసులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయాల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి అనంతరం బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశా రు. అమ్మవార్లకు అర్చకులు వివిధ అభరణాలు, వివిధరకాల పూలు, పట్టువసా్త్రలతో అలం కరించి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్ర సాదాలను  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోటగడ్డపె ద్దమ్మ ఆలయ పూజారి రాంప్రసాద్‌, క్రిష్ణవేణి, జయమ్మ, మల్లికా, లావణ్య, సూర్యకళ, చంద్ర, లక్ష్మణ్‌, భరత, నరసిం  హులు తదితరులు పాల్గొన్నారు.

పుట్టపర్తి: పోతలప్పస్వామికి జ్యోతులు, బోనాలతో ఘనంగా జాతర నిర్వహించారు. మంగళవారం మండల పరిధిలోని కప్పల బండలో  పో తలప్ప స్వామికి జ్యోతులు,బోనాలతో పూజలు ని ర్వహించారు. గ్రామం లోని ప్రతి ఇంటి నుండి మహిళలు జ్యోతులు, బోనాలతో ఊరేగింపుగా పోతలప్పగుడికి చేరుకుని ప్రదక్షణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ, పూజలు చేసి జ్యోతులు, బోనాలను సమర్పించారు. పూజలో గ్రామస్థులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ పూజల్లో మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పా ల్గొని పోతలప్పస్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్య క్రమంలో కౌన్సిలర్‌ రత్నప్పచౌదరి, కన్వీనర్‌విజయ్‌కుమార్‌, మాజీ జడ్పీ టీసీ చెన్నకేశవులు, నాయకులు శ్రీరామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సాలక్క గారి శ్రీనివాసులు, గూడూరు ఓబుళేశు, సామకోటి ఆదినారాయణ, గోపాల మూర్తి, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-28T07:02:07+05:30 IST