తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
ABN , First Publish Date - 2022-07-04T04:00:41+05:30 IST
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు అని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. ఆదివారం గాండ్ల తెలుకుల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు
- ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 3: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు అని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. ఆదివారం గాండ్ల తెలుకుల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. బోనాలలో ఎమ్మెల్యే దివాకర్రావు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. అనంతరం గాండ్ల సంఘం జిల్లా అద్యక్షుడు లెక్కల విజయ్, నడిపెల్లి విజిత్రావు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఏనుగు రవిందర్రెడ్డి, మహిళా నాయకురాలు అత్తి సరో జ, అన్నయ్య, హరిప్రసాద్, జక్కం పూర్ణచందర్, మల్లన్న, వీరమల్లు, జయప్రద, వీణరాణిదాస్, బోడ ధర్మేందర్, మాధవి, సదానందం, జ్యోతి, సంపత్, రాజు, తదితరులు పాల్గొన్నారు.