ఊరూరా బోనాల సందడి

ABN , First Publish Date - 2021-08-02T05:59:02+05:30 IST

గోదావరిఖనిలో రేణుకదేవి బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వ హించారు.

ఊరూరా బోనాల సందడి
గోదావరిఖనిలో బోనాలతో వెళుతున్న మహిళలు

మార్కండేయకాలనీ, ఆగస్టు 1: గోదావరిఖనిలో రేణుకదేవి బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వ హించారు. గీత పారిశ్రామిక సంఘం నెం2, గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మహిళలు డప్పుచప్పుళ్ల మధ్య బోనాలతో రాజేష్‌ థియేటర్‌ సమీపంలోని ఆలయం వరకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడగోని శశిరేఖ, బొంగుని లావణ్య, ఎర్రోల అనిత, గుర్రం పద్మ, పూరెళ్ల పద్మ, బండారి కవిత, గంగాధర దేవేందర్‌, కట్టగోని శ్రీలత, పబ్బ స్వరూప, గట్ల పుష్పలత, బాలసాని భాగ్యలక్ష్మి, శ్రీవిద్య, కదిరే భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

మంథనిలో..

మంథని, ఆగస్టు 1: మంథని పట్టణంలోని రజకులంతా తమ కులదైవమైన శ్రీమడేలయ్య బోనాల ఉ త్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వా మితో పాటు శ్రీకట్ట మైసమ్మ, శ్రీపెద్ద పోచక్కతల్లి, శ్రీ మధున పోచమ్మ, వాగు ఒడ్డు పోచమ్మ తల్లులకు ప్ర త్యేక పూజలు నిర్వహించి సామూహిక బోనాలు స మర్పించారు. విశ్వబ్రాహ్మణులు సైతం శ్రీపెద్ద పోచక్కతల్లి, శ్రీ మఽదున పోచమ్మ తల్లులకు సామూహిక బోనాలు సర్పించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్‌ గర్రెపల్ల సత్యనారాయణ, శ్రీమహాల క్ష్మి దేవాలయ కమిటీ డైరెక్టర్‌ కాయితోజు సమ్మయ్య, రజక సంఘం అధ్యక్షుడు పోతరాజు సమ్మయ్య, నా యకులు కొల్లూరి రాజయ్య, సమ్మయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T05:59:02+05:30 IST