అమ్మ ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం

ABN , First Publish Date - 2021-05-13T06:09:47+05:30 IST

స్థానిక నల్లపాడు సమీపంలోని అమ్మ చారిటబుల్‌ ట్రస్టు నిత్యాన్నదాన పథకంలో భాగంగా అన్నపూర్ణ భవనం నిర్మాణానికి బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ఫౌండేషన్‌ రూ.11 లక్షల విరాళాన్ని బుధవారం అందజేశారు.

అమ్మ ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం
సర్రాజు బాలచందర్‌కు చెక్కు అందజేస్తున్న వూటుకూరి నాగేశ్వరరావు

గుంటూరు (సాంస్కృతికం), మే 12: స్థానిక నల్లపాడు సమీపంలోని అమ్మ చారిటబుల్‌ ట్రస్టు నిత్యాన్నదాన పథకంలో భాగంగా అన్నపూర్ణ భవనం నిర్మాణానికి బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ఫౌండేషన్‌ రూ.11 లక్షల విరాళాన్ని బుధవారం అందజేశారు. ఫౌండేషన్‌ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు చెక్కును అమ్మ చారిటబుల్‌ ట్రస్టు తరపున సర్రాజు బాలచందర్‌కు అందజేశారు. కార్యక్రమంలో సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-13T06:09:47+05:30 IST