కందుకూరు పాలఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా బొమ్మకూరి ప్రశాంత్కుమార్
ABN , First Publish Date - 2022-06-30T05:58:51+05:30 IST
కందుకూరు పాలఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా బొమ్మకూరి ప్రశాంత్కుమార్
కందుకూరు, జూన్ 29: మండల కేంద్రంలోని పాల ఉత్పత్తిదారుల సంఘం(మదర్ డెయిరీ) అధ్యక్షుడిగా బొమ్మకూరి ప్రశాంత్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామరైతులతో బుధవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశం అనంతరం ఎన్నికల అధికారి తాళ్ల లింగం ఈ ఎన్నికను ప్రకటించారు. సంఘం మాజీచైర్మన్లు ప్రభాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, సుధాకర్రెడ్డి, జనాలు, నర్సింహ, జంగయ్య, అంతిరెడ్డి, యాదగిరిరెడ్డి, రాములు, సంజీవరెడ్డి, హరికిషన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.