ఏజెన్సీలో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2021-06-24T04:59:41+05:30 IST

విశాఖ ఏజెన్సీ లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌, బుధవారం జరిగిన మందుపాతర నిర్వీర్యం ఘటనలతో పశ్చిమ ఏజెన్సీలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

ఏజెన్సీలో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు
కల్వర్టులు పరిశీలిస్తున్న స్క్వాడ్‌


విశాఖ ఘటనతో పశ్చిమలో అలర్ట్‌


బుట్టాయగూడెం, జూన్‌ 23: విశాఖ ఏజెన్సీ లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌, బుధవారం జరిగిన మందుపాతర నిర్వీర్యం ఘటనలతో పశ్చిమ ఏజెన్సీలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. వారం రోజులుగా ఏలూరు నుంచి వచ్చిన బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌, పోలీస్‌ బృందాలు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. బుధవారం కూడా ఏలూరు నుంచి వచ్చిన ప్రత్యేక పోలీస్‌ బృందం ఏజెన్సీ ప్రాంతంలో తనిఖీ చేసింది. వంతెనలు, కల్వర్టులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యనేతలు నివాసముండే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేసి తనిఖీ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లాల న్నా ముందుగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్‌ బృందాలు తనిఖీ చేసిన తర్వాతే పర్యటించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. ఏజెన్సీలోని వంతెనలు, కల్వర్టులు, జనసంచారం ఉండే ప్రాంతాలు, అనుమానం ఉన్న ప్రతిచోట తనిఖీ చేస్తున్నారు.

Updated Date - 2021-06-24T04:59:41+05:30 IST