బాంబులతో మొక్కల తొట్టెలు!
ABN , First Publish Date - 2021-04-06T05:30:00+05:30 IST
అక్కడ రోజుకో బాంబు బయటపడుతుంది. బాంబుల శిథిలాలను మొక్కలు పెంచడానికి తొట్టెలుగా, పడవలుగా ఉపయోగిస్తారు. ఈ దృశ్యాలన్నీ వియత్నాంలోని లావోస్లో కనిపిస్తాయి...
అక్కడ రోజుకో బాంబు బయటపడుతుంది. బాంబుల శిథిలాలను మొక్కలు పెంచడానికి తొట్టెలుగా, పడవలుగా ఉపయోగిస్తారు. ఈ దృశ్యాలన్నీ వియత్నాంలోని లావోస్లో కనిపిస్తాయి.
- నలభై ఏళ్ల క్రితం వియత్నాంతో జరిగిన యుద్ధంలో అమెరికా కొన్ని లక్షల టన్నుల బాంబులను ఆ దేశంపై జారవిడిచింది. ముఖ్యంగా లావోస్పై లెక్కలేనన్ని బాంబులు ప్రయోగించింది. ఒక అంచనా ప్రకారం 5 లక్షల 80 వేల బాంబులు ప్రయోగించినట్టు తేలింది.
- ఆ బాంబుల్లో 30 శాతం పైగా పేలలేదు. పేలని బాంబులు లావోస్లో ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. వీటిలో ఒక్కోటి 1000కేజీల బరువున్నవి కూడా ఉన్నాయి.
- లావోస్ గ్రామస్థులు దొరికిన బాంబులను పగలగొట్టి వాటిలో పేలుడు పదార్థాన్ని తొలగించి, ఇనుమును అమ్ముకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ బాంబులను వెలికితీసే క్రమంలో అవి పేలి ప్రమాదానికి గురైన వాళ్లు, చనిపోయిన వాళ్లూ ఉన్నారు.
- తమకు దొరికిన బాంబు షెల్స్ను బకెట్లుగా, మొక్కలు పెంచుకునే తొట్టెల్లుగా ఉపయోగిస్తున్నారు లావోస్ ప్రజలు. కొందరైతే బాంబులను అలాగే తీసుకొచ్చి ఇంటి ముందు అలంకరణ కోసం వాడుతున్నారు.