పంజాబ్ కోర్టులో బాంబ్ బ్లాస్ట్.. ఇద్దరు దుర్మరణం
ABN , First Publish Date - 2021-12-23T20:13:27+05:30 IST
కోర్టు కాంప్లెక్స్లో ఉన్న రెండవ ఫ్టోర్ బాత్రూంలో నుంచి ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు బాత్రూం గోడలు ధ్వంసమై సమీపంలోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్ సహా పోలీసులు సహాయక చర్యలు అందిస్తున్నారు.
చండీగఢ్: పంజాబ్లోని లుధియానాలో ఉన్న జిల్లా కోర్టు క్లాంప్లెక్స్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. గురువారం మధ్యాహ్నం 12:22 గంటల సమయంలో ఈ పేలుడులో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్స్లో ఉన్న రెండవ ఫ్లోర్ బాత్రూంలో నుంచి ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు బాత్రూం గోడలు ధ్వంసమై సమీపంలోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్ సహా పోలీసులు సహాయక చర్యలు అందిస్తున్నారు.
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఆందోళన వ్యక్తం చేశాను. తాను వెంటనే లుధియానా వెళ్తున్నానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత మంది దేశ వ్యతిరేక శక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని, ఇలాంటి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని సీఎం చన్నీ తెలిపారు.