cricket:రిటైర్మెంట్ తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్లను...ఎంఎస్ ధోనీ స్పష్టం

ABN , First Publish Date - 2021-10-06T16:07:33+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రిటైర్మెంట్ తర్వాత తాను బాలీవుడ్‌లోకి వెళ్లనని...

cricket:రిటైర్మెంట్ తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్లను...ఎంఎస్ ధోనీ స్పష్టం

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రిటైర్మెంట్ తర్వాత తాను బాలీవుడ్‌లోకి వెళ్లనని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశారు. గత ఏడాది ఆగస్టు 15వతేదీన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోని ప్రస్థుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లలో ఆడుతున్నారు.చెన్నై సూపర్ కింగ్స్ తో వీడ్కోలు ఆట గురించి ఇటీవల ధోనీ సూచనప్రాయంగా చెప్పారు. చాలామంది క్రికెటర్లు రిటైర్ అయిన తర్వాత బాలీవుడ్ లోకి ప్రవేశించారు, కానీ తాను మాత్రం బాలీవుడ్ సినిమాల్లోకి వెళ్లే ప్రణాళిక ఏదీ లేదని ధోనీ ప్రకటించారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎంఎస్ ధోనీ బయోపిక్ లో నటించారు. 


నటన తేలికైన పని కాదని, అందుకే తాను క్రికెట్ కు కట్టుబడి ఉంటానని ధోనీ స్పష్టం చేశారు. సినిమాల్లో నటించడం అంటే టీ కప్పు లాంటిది కాదని, చాలా కఠినమైన వృత్తి అని ధోని చెప్పారు.సినిమా నటులున్నారుగా వారిని నటించనివ్వండి అని చెప్పారు. తాను ప్రకటనలు చేస్తూ సంతోషంగా ఉంటున్నానని ధోని పేర్కొన్నారు.ఇటీవల క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫ్రెండ్‌షిప్ అనే తమిళ చిత్రంలో నటించారు. బ్రెట్ లీ, అజయ్ జడేజా, వినోద్ కంబలి వంటి క్రికెటర్లు కూడా గతంలో సినిమాల్లో నటించారు. 


Updated Date - 2021-10-06T16:07:33+05:30 IST