ఎన్సీబీ చేతికి కరణ్ జోహార్ వీడియో.. బాలీవుడ్లో కలకలం
ABN , First Publish Date - 2020-09-18T20:23:50+05:30 IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్ బడా స్టార్ల పేర్లతో కూడిన ఫిర్యాదు ఎన్సీబీకి శుక్రవారం అందింది.
ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్ బడా స్టార్ల పేర్లతో కూడిన ఫిర్యాదు ఎన్సీబీకి శుక్రవారం అందింది. ఆ ఫిర్యాదులో కరణ్ జోహార్ వీడియో జత చేసి ఉండటం సంచలనం సృష్టిస్తోంది. 2019నాటి ఆ వీడియోలో కరణ్ జోహార్తో పాటు దీపికా పదుకోణే, విక్కీ కౌశాల్, మరికొందరు స్టార్లు ఉన్నారు. సోమవారం నుంచి ఎన్సీబీ జరుపనున్న విచారణలో.. మరికొందరు స్టార్లకు నోటీసులు అందే అవకాశం ఉందని తెలుస్తోంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు దర్యాప్తు రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. ఎన్సీబీ అధికారులు ఇప్పటికే సుషాంత్ స్నేహితురాలు రియా, ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిండా, వంటమనిషి దినేష్ సావంత్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు రావడంతో పెద్ద దుమారమే చెలరేగింది. సుషాంత్ కేసు దర్యాప్తులో సంబంధిత అధికారులు జోరు పెంచారు.