-
-
Home » Andhra Pradesh » Bojjala Gopalakrishnareddy Eyelid-MRGS-AndhraPradesh
-
Bojjala Gopala Krishna Reddy కన్నుమూత
ABN , First Publish Date - 2022-05-06T21:15:45+05:30 IST
మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు.
హైదరాబాద్: మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి srikalahasti constituency నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం Chandrababu కాబినెట్లో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. Gopala Krishna Reddy మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇటీవల బొజ్జల పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన నివాసంలోనే చంద్రబాబు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపించారు. టీడీపీ పేరు మీద రూపొందించిన కేక్ను బొజ్జలకు చంద్రబాబు స్వయంగా తినిపించారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు. తీవ్ర అనారోగ్యంతో మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తిరిగి ఆయనను కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు.