కరోనా నుంచి బొజ్జల దంపతులు కోలుకోవాలి
ABN , First Publish Date - 2022-01-15T07:08:39+05:30 IST
కరోనా నుంచి మాజీ మంత్రి బొజ్జల దంపతులు త్వరగా కోలుకోవాలని ముస్లింలు ప్రార్థనలు చేశారు.
శ్రీకాళహస్తి, జనవరి 14: కరోనా నుంచి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బృందమ్మ దంపతులు త్వరగా కోలుకోవాలని ముస్లింలు ప్రార్థనలు చేశారు. శుక్రవారం పట్టణ మసీదుల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ... శ్రీకాళహస్తి అభివృద్ధి, మైనార్టీల సంక్షేమానికి బొజ్జల ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నేతలు షాకీరాలీ, షఫి, బషీర్, ఖలీల్, మస్తాన్, కరీం, అస్మత్, మీర్జా, ఖాదర్బాషా, మహ్మద్, హజ్రత్, అలీ, లాల్బాషా, సమీవుల్లా, సాజిద్, ఖాదర్వలి తదితరులు పాల్గొన్నారు.