Hyderabadలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2022-08-12T18:32:26+05:30 IST
రాయదుర్గం పీఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది.
హైదరాబాద్: రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ బండారి లే అవుట్ వద్ద నిర్మాణ పనుల కోసం తవ్విన గుంతలో మృతదేహాన్ని గుర్తించారు. భవన నిర్మాణం కోసం గుంతలు తవ్విన నిర్మాణ సంస్థలు అలానే వదిలేశారు. అదే గుంతలో డెడ్ బాడీ నీ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి యాభై సంవత్సరాలు ఉండొచ్చని అంచనా. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభించక పోవడంతో గుర్తు తెలియని మృతదేహం గా కేసు నమోదు చేశారు. డెడ్ బాడిని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.