Jagityal: గల్లంతైన రిపోర్టర్ మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-07-15T15:17:23+05:30 IST

నాలుగురోజుల క్రితం గల్లంతైన ఓ టీవీ రిపోర్టర్ జమీర్ మృతదేహం లభ్యమైంది

Jagityal: గల్లంతైన రిపోర్టర్ మృతదేహం లభ్యం

జగిత్యాల: నాలుగురోజుల క్రితం గల్లంతైన ఓ టీవీ రిపోర్టర్ జమీర్ (Jameer) మృతదేహం లభ్యమైంది. చెట్ల కొమ్మల్లో  చిక్కుకున్న మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించింది. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు. కాగా... అంతకుముందే రిపోర్టర్ కార్ ఆచూకీ కూడా లభ్యమైంది. క్రేన్ సహాయంతో  రెస్క్యూ సిబ్బంది కారును బయటకు తీశారు. రిపోర్టర్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


కాగా.... జిల్లాలోని రాయికల్ మండలం బోర్నపల్లిలో గోదావరి నదిలో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను కాపాడేందుకు చేపట్టిన సహాయక కార్యక్రమాల కవరేజ్ కోసం రిపోర్టర్ జమీర్ అక్కడికి వెళ్లారు. అయితే భూపతిపూర్ డ్యామ్ వద్ద రోడ్డుపై నుంచి వాగు ప్రవహిస్తున్నప్పటీ.... జమీర్‌ తన కారును ముందుకు తీసుకెళ్లడంతో కొట్టుకుపోయింది. జమీర్‌తో పాటు మరో వ్యక్తి తప్పించుకుని ప్రాణాలు రక్షించుకోగా... రిపోర్ట్‌ వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2022-07-15T15:17:23+05:30 IST