అదృశ్యమైన బాలిక గొయ్యిలో మృతదేహమై లభ్యం

ABN , First Publish Date - 2021-03-03T14:37:14+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది...

అదృశ్యమైన బాలిక గొయ్యిలో మృతదేహమై లభ్యం

బులంద్‌షహర్‌ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఆరు రోజుల క్రితం తప్పిపోయిన ఓ బాలిక బులంద్‌షహర్‌ పట్టణ సమీపంలోని సిసౌరా గ్రామంలోని గొయ్యిలో ఖననం చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలిక మృతదేహాన్ని బులంద్ షహర్ పోలీసులు మంగళవారం వెలికి తీశారు. బాలికపై అత్యాచారం చేసి చంపినట్లు బాధితురాలి కుటుంబం ఆరోపించింది.సిరారా గ్రామానికి చెందిన టీనేజ్ బాలిక తన తల్లి, సోదరితో కలిసి పొలానికి వెళ్లింది. మంచినీళ్లు దప్పిక తీర్చుకునేందుకు బాలిక పొలం సమీపంలోని ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. బాలిక కోసం వెతికినా ఆమె జాబ లేకుండా పోయింది. దీంతో ఫిబ్రవరి 25వతేదీన బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


బాలిక తప్పిపోయిన పొలం నుంచి వంద మీటర్ల దూరంలోని గొయ్యి తీసి బాలిక మృతదేహాన్ని ఖననం చేశారని స్థానికులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి గొయ్య తీసి బాలిక మృతదేహాన్ని వెలికితీశారు.బాలిక మృతదేహాన్ని ఇప్పుడు పోస్టుమార్టం కోసం పంపారు. బాలిక మృతదేహం వెలికితీసిన ఇంట్లో తండ్రీకొడుకులు ఉన్నారని, వారిలో తండ్రిని అరెస్టు చేశామని, కుమారుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. తండ్రి కొడుకులు బాలికపై అత్యాచారం చేసి, హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు. బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు.

Updated Date - 2021-03-03T14:37:14+05:30 IST