చంద్రబాబును కలిసిన వేణుగోపాలరావు

ABN , First Publish Date - 2022-07-06T06:55:09+05:30 IST

పెడన పట్టణ తెలుగుదేశం పార్టీలో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో టీడీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బొడ్డు వేణుగోపాలరావు పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు.

చంద్రబాబును కలిసిన వేణుగోపాలరావు

పెడన  : పెడన పట్టణ తెలుగుదేశం పార్టీలో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో  టీడీపీ సీనియర్‌ నేత,  రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బొడ్డు వేణుగోపాలరావు పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. పెడన మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీ  అభ్యర్ధులకు జరిగిన అన్యాయాన్ని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆయన  చంద్రబాబు నాయుడికి వివరించారు. నేను అండగా ఉండగా ఇతరులతో విభేదాలు ఎందుకు, పార్టీ కోసం పనిచేయండి అని చంద్రబాబు ఆయనతో అన్నట్టు సమాచారం.  వేణుగోపాలరావు చెప్పినదంతా విన్న చంద్రబాబు నాయుడు సమర్థులకే పెడన టికెట్‌ ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. పెడన పరిస్థితిపై చంద్రబాబునాయుడు పూర్తి అవగాహనతో మాట్లాడటంతో వేణుగోపాలరావుతో పాటు ఆయన వెంట వెళ్లిన నాయకులు ఆశ్చర్యానికి గురైనట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని పెడనలో విభేదాలను పది రోజుల్లో పరిష్కరిస్తానని వేణుగోపాలరావుకు హామీ ఇచ్చారట. చంద్రబాబును కలిసిన వారిలో పట్టణ టీడీపీ నాయకులు యక్కల శ్యామలయ్య, వహబ్‌ ఖాన్‌, చందన నారాయణరావు, అనుముల పూర్ణచంద్రరావు, హమీదుల్లా, ఖాజా, పరసా జితేంద్ర, ఎలిగట్ల ప్రసాద్‌, బొడ్డు దీక్షానందుడు ఉన్నారు. 

Updated Date - 2022-07-06T06:55:09+05:30 IST