అభివృద్ధి చేయకుండా.. గడప తొక్కేదెలా!

ABN , First Publish Date - 2022-05-15T08:27:07+05:30 IST

అభివృద్ధి చేయకుండా.. గడప తొక్కేదెలా!

అభివృద్ధి చేయకుండా.. గడప తొక్కేదెలా!

బొబ్బిలి వైసీపీ నేత ఆవేదన


బొబ్బిలి, మే 14: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అభివృద్ధి చేయకుండా ప్రజల వద్దకు ఎలా వెళ్లగలం? అంటూ వైసీపీ ప్రజాప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి 21వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ మరిశర్ల రామారావు నాయుడు శనివారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, మునిసిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల గడపను ఎలా తొక్కగలమని ప్రశ్నించారు. ‘వివిధ కాలనీల అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి. వాటితో ఏ పనులూ జరగలేదు. ఆ నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. సమ్యలను పరిష్కరించకుండా వెళితే వార్డు ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-15T08:27:07+05:30 IST