నవంబర్ 7 నుంచి పాపికొండలకు బోటింగ్
ABN , First Publish Date - 2021-10-28T00:39:25+05:30 IST
గోదావరి బోటు ఆపరేటర్లతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
అమరావతి: గోదావరి బోటు ఆపరేటర్లతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. నవంబర్ 7 నుంచి పాపికొండలు బోటింగ్కు అనుమతి ఇచ్చారు. పర్యాటకులకు బోట్లలో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. బోటింగ్ చేసేటపుడు భద్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ముత్తంశెట్టి పేర్కొన్నారు.