బోర్డు సన్మానానికి విరాట్‌ నో!

ABN , First Publish Date - 2022-01-19T08:46:44+05:30 IST

భారత జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇప్పటిదాకా 99 టెస్టులు ఆడాడు. దక్షిణాఫ్రికాతో సిరీ్‌సను 1-2తో ఓడిన అనంతరం అతడు కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే...

బోర్డు సన్మానానికి విరాట్‌ నో!


న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇప్పటిదాకా 99 టెస్టులు ఆడాడు. దక్షిణాఫ్రికాతో సిరీ్‌సను 1-2తో ఓడిన అనంతరం అతడు కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని బహిర్గతం చేయకముందు బీసీసీఐకి తన నిర్ణయాన్ని తెలిపాడు. ఈ సమయంలో బోర్డు ఇచ్చిన ఆఫర్‌ను కోహ్లీ తిరస్కరించాడట. అదేమిటంటే.. తన కెప్టెన్సీలోనే బెంగళూరులో వందో టెస్టును ఫేర్‌వెల్‌ మ్యాచ్‌గా ఆడాలని బోర్డు కోరినట్టు సమాచారం. వచ్చే నెలలో శ్రీలంకతో భారత్‌ టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. ‘ఒక్క మ్యాచ్‌తో పరిస్థితులేమీ మారవు. అలాంటి వాటిని పట్టించుకునే వాడిని కాదు’ అని కోహ్లీ స్పష్టం చేసినట్టు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. భారత జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సేవలందించినందుకు బోర్డు అతడిని తగిన రీతిలో గౌరవిద్దామనుకున్నట్టుంది. కానీ వన్డే కెప్టెన్సీని బలవంతంగా లాగేసుకున్నారనే భావనలో ఉన్న కోహ్లీ ఈ ఆఫర్‌ పట్ల సానుకూలత వ్యక్తం చేయలేదు.

Updated Date - 2022-01-19T08:46:44+05:30 IST