50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు సెలవులు..బెంగళూరు ఆర్టీసీ నిర్ణయం

ABN , First Publish Date - 2020-07-01T00:20:22+05:30 IST

కరోనా విజృంభిస్తున్న తరుణంలో సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం బెంగళూరు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు సెలవులు..బెంగళూరు ఆర్టీసీ నిర్ణయం

బెంగళూరు: కరోనా విజృంభిస్తున్న తరుణంలో సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం బెంగళూరు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సెలవులపై పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ప్రస్తావించింది. కేంద్రం నిబంధనల ప్రకారం..అటువంటి ఉద్యోగులకు ప్రజలతో నేరుగా సంబంధం ఉండే బాధ్యతలను కేటాయించకూడదన్న విషయం తెలిసిందే. అంటే ఈ నిబంధన ప్రకారం కండక్టర్లకు, డ్రైవర్లకు మాత్రమే ఈ సౌలభ్యం వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే బీఎమ్‌టీసీ మరో అడుగు ముందుకేసి..గ్రూప్ సీ గ్రూప్ డీ ఉద్యోగులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించింది.

Updated Date - 2020-07-01T00:20:22+05:30 IST