అమరావతి ఎంపీ Navneet Rana ఫ్లాట్‌ను చెక్ చేసేందుకు బీఎంసీ రెడీ

ABN , First Publish Date - 2022-05-03T23:44:09+05:30 IST

అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవిరాణా అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేసేందుకు బృహన్

అమరావతి ఎంపీ Navneet Rana ఫ్లాట్‌ను చెక్ చేసేందుకు బీఎంసీ రెడీ

ముంబై: అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవిరాణా అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేసేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) సిద్ధమైంది. ఈ మేరకు నేడు నోటీసులు జారీ చేసింది. బహుశా ఈ నెల నాలుగో తేదీన వారి ఫ్లాట్‌ను అధికారులు తనిఖీ చేసి అక్రమ నిర్మాణాలు ఏవైనా ఉన్నాయేమో పరిశీలించే అవకాశం ఉంది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1888లోని సెక్షన్ 488 ప్రకారం నోటీసులు జారీ చేసినట్టు బీఎంసీ అధికారులు తెలిపారు.


శాంటాక్రజ్ వెస్ట్‌లోని కేంద్రమంత్రి నారాయణ్ రాణే, కుషి బెల్మోండో భవనానికి పంపినట్టుగానే ఈ నోటీసులు ఉన్నట్టు చెప్పారు. కాగా, అక్కడ బీజేపీ నేత మోహిత్ కాంబోజ్‌కు పలు ఫ్లాట్లు ఉన్నాయి. ఈ చట్టం కింద నోటీసులు పంపిన తర్వాత మునిసిపల్ అధికారులు తనిఖీల కోసం ఏ ప్రాంగణంలోకైనా ప్రవేశించేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది.


Navneet Rana దంపతులపై నమోదైన  క్రిమినల్ కేసులను చూస్తున్న న్యాయవాది రిజ్వాన్ మర్చంట్ మాట్లాడుతూ.. బీఎంసీ నోటీసుల గురించి తనకు తెలియదని అన్నారు. ఒకవేళ పంపి ఉంటే ఫ్లాట్ యజమాని, లేదంటే అందులో ఉంటున్న వారి సమక్షంలోనే తనిఖీలు చేయాల్సి ఉంటుందని అన్నారు.  


Read more