‘కాంగ్రెస్‌లో చేరే ఆలోచనే లేదు’

ABN , First Publish Date - 2021-11-10T18:26:31+05:30 IST

మంత్రి పదవి రాకున్నా నిరాశపడబోనని బీజేపీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్‌ స్పష్టం చేశారు. చెన్నపట్టణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను

‘కాంగ్రెస్‌లో చేరే ఆలోచనే లేదు’

             - మంత్రి పదవి రాకున్నా సరే.. బీజేపీలోనే కొనసాగుతా: సీపీ యోగేశ్వర్‌ 


బెంగళూరు(Karnataka): మంత్రి పదవి రాకున్నా నిరాశపడబోనని బీజేపీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్‌ స్పష్టం చేశారు. చెన్నపట్టణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రె్‌సలో చేరబోతున్నట్లు మీడియాలో వెలువడుతున్న కథనాలు పూర్తిగా నిరాధారమన్నారు. ఆరునెలలకోసారి ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వదంతులను కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ తనను ఎమ్మెల్సీ చేసింది. గతంలో మంత్రి పదవితో సముచిత స్థానం కల్పించింది. భవిష్యత్తులో మరోసారి మంత్రిగా పనిచేసే అవకాశం రావచ్చు. ఒకవేళ రాకపోయినా నిరాశ చెందను. సామాన్య కార్యకర్తలాగా పార్టీకి సేవలందిస్తానని యోగేశ్వర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో సంబంధాలు ముగిసిన అధ్యాయమని ఆయన అభివర్ణించారు. హానగల్‌ విజయంతో కాంగ్రెస్‌ నేతలు ఏదో సాధించేశామన్న ఊపుతో ఊహాలోకాల్లో తేలియాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-11-10T18:26:31+05:30 IST