పీఎల్‌ఐతో తయారీకి ఊతం

ABN , First Publish Date - 2021-03-06T06:34:55+05:30 IST

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం ప్రాధాన్యతను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఈ పథకం ఎగుమతులు, దేశీయ తయారీ రంగానికి మరింత ఊతం ఇస్తుందన్నారు. నీతిఆయోగ్‌, పరిశ్రమలు, అంతర్జాతీయ వాణిజ్య

పీఎల్‌ఐతో తయారీకి ఊతం

ఐదేళ్లలో రూ.37.96 లక్షల కోట్ల ఉత్పత్తి: ప్రధాని మోదీ


న్యూఢిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం ప్రాధాన్యతను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఈ పథకం ఎగుమతులు, దేశీయ తయారీ రంగానికి  మరింత ఊతం ఇస్తుందన్నారు. నీతిఆయోగ్‌, పరిశ్రమలు, అంతర్జాతీయ వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని ఈ విషయం చెప్పారు. పీఎల్‌ఐ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో దేశీయ తయారీ రంగం ఉత్పత్తి 52,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.37.96 లక్షల కోట్లు) మేర పెరుగుతుందన్నారు.


రూ.2 లక్షల కోట్లు: పీఎల్‌ఐ పథకం కోసం ఐదేళ్లలో ఖర్చు చేసేందుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఈ పథకం కారణంగా ఆయా రంగాల్లో ఉపాధి పొందే వారి సంఖ్యా వచ్చే ఐదేళ్లలో రెట్టింపు అవుతుందన్నారు. 

Updated Date - 2021-03-06T06:34:55+05:30 IST