ఓ వ్యక్తి తన భార్యను మర్డర్ చేశాడు.. ఎలా పట్టుబడ్డాడో తెలుసా.. అతడి గోళ్లపై..

ABN , First Publish Date - 2022-05-11T01:19:31+05:30 IST

ముంబై : ఓ 22 ఏళ్ల వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి సైలెంట్‌గా తన రూంకి వెళ్లిపోయాడు.

ఓ వ్యక్తి తన భార్యను మర్డర్ చేశాడు.. ఎలా పట్టుబడ్డాడో తెలుసా.. అతడి గోళ్లపై..

ముంబై : ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక  సైలెంట్‌గా తన రూంకి వెళ్లిపోయాడు. హత్యకు వాడిన ఆయుధం సహా అక్కడ ఎలాంటి ఆనవాళ్లూ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇక పోలీసులు గుర్తించలేరులే అని భావించి ఓ కట్టుకథను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత హత్యకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి క్లూస్ టీం వచ్చేసింది. ఏమీ తెలియనట్టు అక్కడికి చేరుకున్న హంతక భర్త పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. తనకేం సంబంధంలేదని బోల్తాకొట్టించే ప్రయత్నం చేశాడు. అయితే క్లూస్ కోసం అన్వేషిస్తున్న టీంకు హంతకుడు అడ్డంగా దొరికాడు. అతడి గోళ్లపై ఉన్న రక్తపు మరకలను గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో నిజం వెలుగుచూసింది. హంతకుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటన ముంబై నగరంలోని సకినకా ఏరియాలో వెలుగుచూసింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 22 ఏళ్ల మనోజ్ ప్రజాపతి ఈ నేరానికి పాల్పడ్డాడు. మృతురాలి పేరు రీమా భోళా యాదవ్‌గా వెల్లడించారు. గత రెండు రోజులుగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. మృతురాలు రక్తపు మడగులో పడివుండడాన్ని ఆమె స్నేహితుడు ఒకరు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడని పోలీసులు వెల్లడించారు. మనోజ్ ప్రజాపతి గోళ్లపై రక్తపు మరకలను గుర్తించి ప్రశ్నించడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలికి చివరిసారిగా ఫోన్ చేసింది భర్తేనని గుర్తించామని వెల్లడించారు. హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, హత్య కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే హత్యకు దారితీసిన కారణాలను పేర్కొనలేదు. కాగా నేరస్థులు దొంగ ఎత్తులు వేస్తే వాటిని చిత్తు చేసే నైపుణ్యం, సామర్థ్యాలు పోలీసుల సొంతం. నేరం నుంచి తప్పించుకోవచ్చనే భావనతో నేరాలకు పాల్పడం దొరికిపోవడం ఖాయం.

Read more