రక్తదాతలు స్ఫూర్తి ప్రదాతలు: ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-24T05:17:30+05:30 IST

పోలీసు సిబ్బంది రక్తదానం చేసి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ తెలిపారు.

రక్తదాతలు స్ఫూర్తి ప్రదాతలు: ఎస్పీ
18సార్లు రక్తదానం చేసిన మన్మథరావును అభినందిస్తున్న ఎస్పీ



శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: పోలీసు సిబ్బంది రక్తదానం చేసి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ తెలిపారు. శనివారం శ్రీకాకుళం రూరల్‌ మండలం తండేంవలస జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఎస్పీ రక్తదానం చేశారు. అనంత రం పోలీసు అధికారులు, రక్తదానం చేస్తున్నవారితో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 18 సార్లు రక్తదానం చేసిన పోలీసు కానిస్టేబుల్‌ మన్మథరావు ను, పదిసార్లు పైబడి రక్తదానం చేసిన సిబ్బంది శివ, ఆనంద్‌, రామారావు, హేమసుందర్‌ను ఎస్పీ అభినందించారు. రెడ్‌క్రాస్‌ ద్వారా ధ్రువపత్రాలను సిబ్బం దికి ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫ పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఓపెన్‌హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు.  వన్‌టౌన్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

   


Updated Date - 2021-10-24T05:17:30+05:30 IST