అతిథి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2022-01-26T21:32:17+05:30 IST

అతిథి ఫౌండేషన్ ఆధ్వర్యంలోపాతబస్తీలోని కందికల్ గేట్ వద్ద ఉన్న చిత్రగుప్త ఆలయ సమీపంలో బుధవారం రక్తదాన శిబిరం జరిగింది.

అతిథి  ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

హైదరాబాద్: అతిథి  ఫౌండేషన్ ఆధ్వర్యంలోపాతబస్తీలోని కందికల్ గేట్ వద్ద ఉన్న చిత్రగుప్త ఆలయ సమీపంలో బుధవారం రక్తదాన శిబిరం జరిగింది. సుమారు యాభై మంది యువతీ యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ విజయనగర్ కాలనీ శాఖ ఇన్ చార్జ్ బి.అనురాధ ఆధ్వర్యంలో దాతల నుంచి రక్తాన్ని సేకరించారు.ప్రతి ఏటా ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వ తేదీన జెండా వందనం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అతిథి ఫౌండేషన్  అధ్యక్షుడు బి.విక్రమ్ సింగ్ తెలిపారు. 


రక్తదాన శిబిరంలో మజ్లిస్ పార్టీ కార్పోరేటర్ సమద్ భాయి. బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకులు ఆలె జితేంద్ర. ఛత్రినాక ఇనిస్పెక్టర్ జిలానీ,అతిథి ఫౌండేషన్ సలహాదారులు వరకాలయాదగిరి, బి. నర్సింగరావు, హర్షితాసింగ్.ప్రదీప్, ప్రధాన కార్యదర్శి బి.సోనిభాయి,నితిన్ ప్రసాద్ ఠాకూర్ నందిని,రామ్ సింగ్, శ్రీహరి అనూప్ సింగ్ ,రాజేష్ ,రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా క్షత్రియ రాజ్పుత్ సమాజ్ తరపున సోనూ సింగ్ నేతృత్వంలో శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు.

Updated Date - 2022-01-26T21:32:17+05:30 IST