కెల్లలో రక్తదాన శిబిరం
ABN , First Publish Date - 2021-04-21T05:00:15+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా కెల్ల గ్రామంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. టీడీపీ మండల యువనేతలు, చీపురుపల్లి నియోజకవర్గం సీబీఎన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
గుర్ల, ఏప్రిల్ 20: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా కెల్ల గ్రామంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. టీడీపీ మండల యువనేతలు, చీపురుపల్లి నియోజకవర్గం సీబీఎన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తంగా 31 మంది యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. అనంతరం వృద్ధులు, వితంతవులకు పండ్లు, స్వీట్లు అందించారు. పార్టీ మండల అధ్యక్షుడు వెనె ్న సన్యాసినాయుడు, సీబీఎన్ జిల్లా అధ్యక్షురాలు కె.విమలారాణి, చీపురుపల్లి నియోజకవర్గ కన్వీనర్ నారాయణరావు, విజయనగరం బ్లడ్ బ్యాంకు వైద్య నిపుణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.