నేతలు, జర్నలిస్టుల ట్వీట్లను బ్లాక్ చేయండి
ABN , First Publish Date - 2022-06-29T09:08:59+05:30 IST
రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రైతు మద్దతు దారులకు సంబంధించిన బహుళ ఖాతాలు, కొన్ని ట్వీట్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ను కోరింది.
గతేడాది ట్విటర్ను కోరిన కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 28: రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రైతు మద్దతు దారులకు సంబంధించిన బహుళ ఖాతాలు, కొన్ని ట్వీట్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ను కోరింది. 2021 జనవరి 5 నుంచి డిసెంబరు 29 మధ్య కాలంలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి ట్విటర్కు అభ్యర్థనలు అందినట్టు లుమెన్ డేటాబే్సకు సమర్పించిన పత్రాలలో ఉన్నట్టు పీటీఐ వెల్లడించింది. అయితే ఆయా ఖాతాలు, ట్వీట్లు, లింక్లను బ్లాక్ చేశారా లేదా అన్న వివరాలు మాత్రం ఆ డేటాబే్సలో అందుబాటులో లేవు. కేంద్రం ఇచ్చిన జాబితాలో ఎమ్మెల్యే జర్నైల్ సింగ్తోపాటు పలువురు కాంగ్రెస్, ఆప్ నేతల పేర్లు ఉన్నాయి. అలాగే ‘కిసాన్ ఏక్తా మోర్చా’ ట్విటర్ ఖాతాను కూడా బ్లాక్ చేయాలని ప్రభుత్వం కోరిందని పీటీఐ వెల్లడించింది.