నేతలు, జర్నలిస్టుల ట్వీట్లను బ్లాక్‌ చేయండి

ABN , First Publish Date - 2022-06-29T09:08:59+05:30 IST

రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రైతు మద్దతు దారులకు సంబంధించిన బహుళ ఖాతాలు, కొన్ని ట్వీట్లను బ్లాక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కోరింది.

నేతలు, జర్నలిస్టుల ట్వీట్లను బ్లాక్‌ చేయండి

గతేడాది ట్విటర్‌ను కోరిన కేంద్రం

న్యూఢిల్లీ, జూన్‌ 28: రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రైతు మద్దతు దారులకు సంబంధించిన బహుళ ఖాతాలు, కొన్ని ట్వీట్లను బ్లాక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కోరింది. 2021 జనవరి 5 నుంచి డిసెంబరు 29 మధ్య కాలంలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి ట్విటర్‌కు అభ్యర్థనలు అందినట్టు లుమెన్‌ డేటాబే్‌సకు సమర్పించిన పత్రాలలో ఉన్నట్టు పీటీఐ వెల్లడించింది. అయితే ఆయా ఖాతాలు, ట్వీట్లు, లింక్‌లను బ్లాక్‌ చేశారా లేదా అన్న వివరాలు మాత్రం ఆ డేటాబే్‌సలో అందుబాటులో లేవు. కేంద్రం ఇచ్చిన జాబితాలో ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌, ఆప్‌ నేతల పేర్లు ఉన్నాయి. అలాగే ‘కిసాన్‌ ఏక్తా మోర్చా’ ట్విటర్‌ ఖాతాను కూడా బ్లాక్‌ చేయాలని ప్రభుత్వం కోరిందని పీటీఐ వెల్లడించింది.  

Updated Date - 2022-06-29T09:08:59+05:30 IST