లాసన్స్బే పార్కు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టండి
ABN , First Publish Date - 2022-08-17T05:54:53+05:30 IST
నగరంలోని లాసన్స్ బే పార్కులోని సిబ్బందితో పనులు చేయించుకుంటూ, మొత్తం బిల్లు డ్రా చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె లాసన్స్ బే పార్కును ఆకస్మిక తనిఖీ చేశారు.
మేయర్ గొలగాని హరి వెంకటకుమారి
ఐదేళ్లుగా ఇద్దరితోనే పనిచేయిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీత
పెదవాల్తేరు, ఆగస్టు 16: నగరంలోని లాసన్స్ బే పార్కులోని సిబ్బందితో పనులు చేయించుకుంటూ, మొత్తం బిల్లు డ్రా చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె లాసన్స్ బే పార్కును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ సిబ్బంది ఎంతమంది, కాంట్రాక్టు కార్మికులు ఎంతమంది పనిచేస్తున్నారని ఆరా తీసి, హాజరు పట్టీని తనిఖీ చేశారు. పార్కు నిర్వహణలో జీవీఎంసీ నుంచి ఇద్దరు, కాంట్రాక్టర్ నలుగురు కార్మికులతో పనిచేయించాల్సి ఉండగా, ఐదేళ్లుగా ఇద్దరే పనిచేస్తుండడం గమనించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్కు ఎటువంటి బిల్లులు మంజురు చేయవద్దని జేడీ (అమృత) విజయ భారతి, జోనల్ కమిషనర్ను ఆదేశించారు. ఐదేళ్లుగా పార్కులపై దృష్టి సారించని అధికారులపై ఆసహనం వ్యక్తం చేశారు. నగంలో ప్రతి పార్కును సందర్శించాలని ఆదేశించారు.