బ్లాక్‌ ఫంగస్‌తో నలుగురు మృతి

ABN , First Publish Date - 2021-06-11T16:17:57+05:30 IST

విల్లుపురం జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌తో నలుగురు మృతి చెందారు. ఆ జిల్లాలో ఇప్పటివరకూ 12 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పుదుచ్చేరి జి

బ్లాక్‌ ఫంగస్‌తో నలుగురు మృతి


చెన్నై: విల్లుపురం జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌తో నలుగురు మృతి చెందారు. ఆ జిల్లాలో ఇప్పటివరకూ 12 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పుదుచ్చేరి జిప్‌మెర్‌లో చికిత్స పొందుతున్న దిండివనం వడశిరు వలూరుకు చెందిన 55 యేళ్ల వ్యక్తి, చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 యేళ్ల వ్యక్తి, చెన్నై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దిండివనం వకాబ్‌నగర్‌కు చెందిన 65 యేళ్ల వృద్ధుడు, విల్లుపురం ఇందిరా నగర్‌కు చెందిన 52 యేళ్ల వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-06-11T16:17:57+05:30 IST