నల్లజెండాలతో గిరిజనుల నిరసన

ABN , First Publish Date - 2021-12-14T15:18:12+05:30 IST

నీలగిరి జిల్లాలో విస్తరించిన అడవుల నుంచి జనవాసంలోకి వస్తున్న ఏనుగుల నుంచి భద్రత కల్పించాలని గిరిజన గ్రామాల్లో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. గూడలూరు సమీపంలోని దేవర్‌సోలై

నల్లజెండాలతో గిరిజనుల నిరసన

ప్యారీస్‌(చెన్నై): నీలగిరి జిల్లాలో విస్తరించిన అడవుల నుంచి జనవాసంలోకి వస్తున్న ఏనుగుల నుంచి భద్రత కల్పించాలని గిరిజన గ్రామాల్లో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. గూడలూరు సమీపంలోని దేవర్‌సోలై పంచాయతీ పరిధిలోని తాడన్‌తారై, దాని చుట్టుపక్కల గ్రామాల్లో గత కొన్ని నెలలుగా రెండు అడవి ఏనుగులు మకాం వేసి ఇళ్లు, పంటలను ధ్వంసం చేయడంతో పాటు గొర్రెలు, కోళ్లను చంపుతున్నాయని, ఉదయం, సాయంత్రం వేళల్లో పంట పొలాల్లో సంచరించి కోతకు సిద్ధంగా ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయని, అందువల్ల తాము భారీగా నష్టపోతున్నామని గిరిజనులు జిల్లా కలెక్టర్‌కు పలు మార్లు వినతిపత్రాలు సమర్పించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆగ్రహించిన గిరిజనులు, తమ బాధలు అధికారులు తెలుసుకొనేలా ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు.

Updated Date - 2021-12-14T15:18:12+05:30 IST