యశోదా ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ బీజేవైఎం నాయకుల ఆందోళన

ABN , First Publish Date - 2020-08-11T18:54:16+05:30 IST

హైదరాబాద్: కరోనా పేరుతో అక్రమ వ్యాపారం చేస్తూ పేద ప్రజలను దోచుకుంటున్న యశోద ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలంటూ..

యశోదా ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ బీజేవైఎం నాయకుల ఆందోళన

హైదరాబాద్: కరోనా పేరుతో అక్రమ వ్యాపారం చేస్తూ పేద ప్రజలను దోచుకుంటున్న యశోద ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలంటూ బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో యశోదా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కోవిడ్ నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా కరోనా రోగుల నుంచి 15 లక్షల నుంచి 50 లక్షలు గుంజుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో మలక్‌పేట యశోద ఆసుపత్రి ముందు కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి ఈ సర్కార్  ప్రజల రక్తాన్ని పీలుస్తోందని బీజేవైఎం నేతలు ఆరోపించారు.

Updated Date - 2020-08-11T18:54:16+05:30 IST