Bengals Republic Day Eventకు ప్రతిపక్ష నేత సువేందు అధికారికి ఆహ్వానం లేదు...

ABN , First Publish Date - 2022-01-26T13:26:40+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు,బీజేపీకి చెందిన సువేందు అధికారిని...

Bengals Republic Day Eventకు ప్రతిపక్ష నేత సువేందు అధికారికి ఆహ్వానం లేదు...

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు,బీజేపీకి చెందిన సువేందు అధికారిని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు.బెంగాల్ రిపబ్లిక్ డే ఈవెంట్ గెస్ట్ లిస్ట్‌లో బీజేపీకి చెందిన సువేందు అధికారి పేరు లేదు. రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతకు ఆహ్వానం రాకపోవడం ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆహ్వానితుల జాబితాలో సువేందు అధికారి పేరును తొలగించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులకు కూడా ఆహ్వానం అందలేదు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధంఖర్, అసెంబ్లీ స్పీకర్, కేఎంసీ మేయర్, చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, డీజీ,ఐజీ,కోల్‌కతా సీపీ,మరో 15 మంది విదేశీ ప్రతినిధులు, ఆర్మీ అధికారులు సహా గరిష్ఠంగా 60 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 


Updated Date - 2022-01-26T13:26:40+05:30 IST