రోడ్ల మరమ్మతులు చేపట్టాలి
ABN , First Publish Date - 2020-12-06T05:42:52+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రహదారుల మరమ్మతులు చేయాలని, తాడేపల్లిగూడెం–భీమవరం రహదారిని పునరుద్ధరిం చాలని బీజేపీ, జనసేన నాయకులు రాస్తారోకో చేశారు.
బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నాలు
గణపవరం, డిసెంబరు 5 : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రహదారుల మరమ్మతులు చేయాలని, తాడేపల్లిగూడెం–భీమవరం రహదారిని పునరుద్ధరిం చాలని బీజేపీ, జనసేన నాయకులు రాస్తారోకో చేశారు. పిప్పరలో శనివారం జరిగిన రాస్తారోకోలో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇందుకూరి అశోక్ చక్రవర్తి వర్మ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నంద్యాల రామలింగరాజు, ఉంగుటూరు బీజేపీ కన్వీనర్ ఇంటి ఉదయభాస్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు, వరదలకు దెబ్బతిన్న రహదారులను పునరుద్దరించాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని నినదించారు.