ఈ ప్రభుత్వానికి రోడ్ల దుస్థితి పట్టదా?

ABN , First Publish Date - 2020-12-06T04:29:45+05:30 IST

కమిషన్లు రావనే ప్రభుత్వం రోడ్లకు మరమ్మతులు చేయడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆరోపించారు.

ఈ ప్రభుత్వానికి రోడ్ల దుస్థితి పట్టదా?

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ

గుంటూరు(సంగడిగుంట), డిసెంబరు 5: కమిషన్లు రావనే ప్రభుత్వం రోడ్లకు మరమ్మతులు చేయడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆరోపించారు. నగరంలో గుంతలు పడిన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందరంగా రామకృష్ణ మాట్లాడుతూ రోడ్ల మరమ్మతులకు కేంద్రం ఇచ్చిన రూ.1,500 కోట్లు పక్కదారి పట్టించారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు రావెల కిషోర్‌బాబు, జూపూడి రంగరాజు,  పాలపాటి రవికుమార్‌, తన్నీరు ప్రసాద్‌, యామిని శర్మ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-06T04:29:45+05:30 IST