Delhiలో బీజేపీ కార్యకర్తను కాల్చిచంపిన దుండగులు
ABN , First Publish Date - 2022-04-21T12:23:40+05:30 IST
తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్లో 42 ఏళ్ల స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని పోలీసులు తెలిపారు....
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్లో 42 ఏళ్ల స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.మయూర్ విహార్ ఫేజ్-3లో బీజేపీ కార్యకర్త జీతూ చౌదరి తన ఇంటి బయట ఉండగా బైక్పై వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాలుగుసార్లు కాల్చిచంపారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.స్థానికులు జీతూను ఓ ప్రైవేట్ కారులో ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.మృతుడు మయూర్ విహార్లోని బీజేపీ యూనిట్కు చెందిన కార్యకర్త. ఇతను నిర్మాణ రంగ వ్యాపారాన్ని నడుపుతున్నాడు.గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) ప్రియాంక కశ్యప్ తెలిపారు.నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీల ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.