ఎల్లకాలం మోసగించలేమని కేసీఆర్ గ్రహించే రోజులు దగ్గర్లోనే: విజయశాంతి

ABN , First Publish Date - 2021-11-22T01:36:59+05:30 IST

హైదరాబాద్: వేదనతో కళ్లెదురుగా రోదిస్తున్నవాళ్ళను గాలికి వదిలేసి లోకాన్ని ఉద్ధరించడానికి వెళతానన్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు.

ఎల్లకాలం మోసగించలేమని కేసీఆర్ గ్రహించే రోజులు దగ్గర్లోనే: విజయశాంతి

హైదరాబాద్: వేదనతో కళ్లెదురుగా రోదిస్తున్నవాళ్ళను గాలికి వదిలేసి లోకాన్ని ఉద్ధరించడానికి వెళతానన్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో జరిగిన ఉద్యమాల్లో మరణించిన రైతు కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున సాయాన్ని ప్రకటించిన కేసీఆర్‌కు సొంత రాష్ట్రంలో ప్రాణాలు పోగొట్టుకున్న వేలాది మంది రైతు కుటుంబాలు గానీ, ఆయన వల్ల నడిరోడ్డున పడి ఏడుస్తున్న రైతుల గానీ మాత్రం కనిపించడం లేదన్నారు. తెలంగాణ సర్కారు విధానాల వల్ల వరి, మక్క, శనగ రైతులు తమ పంటలకు మంటలు పెట్టుకున్నప్పుడు కూడా కేసీఆర్‌కు రైతుల గోడు పట్టలేదంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Updated Date - 2021-11-22T01:36:59+05:30 IST