‘తెలంగాణపై బీజేపీ కక్ష సాధింపు’
ABN , First Publish Date - 2022-08-20T05:38:34+05:30 IST
‘తెలంగాణపై బీజేపీ కక్ష సాధింపు’
ఆమనగల్లు/తలకొండపల్లి, ఆగస్టు 19: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్నందుకే బీజేపీ కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి విమర్శించారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1.80లక్షలు విలువ గల చెక్కులను శుక్రవారం నగరంలోని తన నివాసంలో అందజేశారు. నాయకులు అశోక్ రెడ్డి, వెంకటేశ్, శ్రీనివాస్ రెడ్డి, కొండల్రెడ్డి, సురేందర్ రెడ్డి, సుమన్, హన్మనాయక్, యాదగిరి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, విజయ్, బాబా, అల్లాజీ పాల్గొన్నారు. అదేవిధంగా తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా రూ.లక్ష మంజూరు కాగా మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నరేందర్గౌడ్, దస్తగిరి, రాజు, శ్యామ్సుందర్రెడ్డి, శ్రీను, శేఖర్, యాదయ్య, రవి, సాయి పాల్గొన్నారు.