బీజేపీ ది ట్రబుల్ ఇంజిన్: Srinivas Goud
ABN , First Publish Date - 2022-07-11T23:05:16+05:30 IST
బీజేపీ (Bjp), టీఆర్ఎస్ (Trs) నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్గాలపై సమీక్షించిన ..
హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (Bjp), టీఆర్ఎస్ (Trs) నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్గాలపై సమీక్షించిన సీఎం కేసీఆర్ (Cm Kcr) అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ప్రధాని మోదీ (Pm Modi), రాష్ట్ర బీజేపీ నేతలపై ఘాటు విమర్శించారు. ఆ వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కూడా ప్రెస్ మీట్ సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఇవాళ మౌన దీక్ష చేపట్టిన బండి సంజయ్ ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే మరోసారి సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (Dk Aruna), బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar) కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ సీఎం కేసీఆర్పై విమర్శలు చేశారు.
దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) స్పందించారు. సీఎం కేసీఆర్ను ఏకవచనంతో మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు. తాము ప్రధానిని దిగజార్చి మాట్లాడలేదన్నారు. ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ ఒక్క ప్రెస్మీట్ కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ‘‘సత్తా ఉంది కాబట్టే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. బీజేపీ నేతలకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. ప్రధాని తెలంగాణ గొంతు పిసకాలని చూస్తున్నారు. బీజేపీ ది ట్రబుల్స్ ఇంజిన్.’’ అని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.