బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-07-05T04:05:47+05:30 IST

బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆపార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి
అల్లూరి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న బీజేపీ నేతలు

కావలి, జూలై 4: బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆపార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బీజేపీ కావలి పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షుడు కే. బ్రహ్మానందం అధ్యక్షతన సోమవారం కావలి నమస్కార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జరిగింది. ఈ సమావేశంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం పట్టణంలోని అన్ని వార్డుల సమస్యలపై  చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రక్రమశిక్షణ కమిటీ సభ్యులు కందుకూరి సత్యనారాయణ, బీజేపీ నేతలు వాయిగండ్ల సుధీర్‌, మంద కిరణ్‌, వింతా రంగారెడ్డి, పూనూరు మాధవి, సీవీసీ సత్యం, బెల్లంకొండ మాల్యాద్రి, కుట్టుబోయిన మాధవరావు, విష్ణుతేజరెడ్డి.మర్రి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-05T04:05:47+05:30 IST