నడ్డా నివాసంలో బీజేపీ నేతల కీలక భేటీ... అభ్యర్థులను ఫైనలైజ్ చేయనున్న బీజేపీ

ABN , First Publish Date - 2021-03-04T18:11:13+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో బీజేపీ కోర్ కమిటీ భేటీ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు బెంగాల్ ఇన్‌చార్జి విజయ వర్గీయ

నడ్డా నివాసంలో బీజేపీ నేతల కీలక భేటీ... అభ్యర్థులను ఫైనలైజ్ చేయనున్న బీజేపీ

న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో బీజేపీ కోర్ కమిటీ భేటీ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు బెంగాల్ ఇన్‌చార్జి విజయ వర్గీయ, దిలీప్ ఘోష్, సుబేంధు అధికారి, ముకుల్ రాయ్, రాహుల్ సిన్హా, శివప్రకాశ్ హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్ల పంపిణీ గురించి వీరిమధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా బెంగాల్ గురించే అత్యధికంగా చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే బెంగాల్ బీజేపీ నేతలు టిక్కెట్ల పంపిణీ విషయంపై భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే వారు ఢిల్లీకి వచ్చారు. మరోవైపు గురువారం సాయత్రం బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఇందులో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ భేటీకి ప్రధాని మోదీ కూడా హాజరవుతారు. 

Updated Date - 2021-03-04T18:11:13+05:30 IST