ఈనెల 9న ఢిల్లీ వేదికగా చేరికలకు BJP నాయకత్వం ప్లాన్

ABN , First Publish Date - 2021-12-02T14:39:31+05:30 IST

డిసెంబర్ 9న ఢిల్లీ వేదికగా చేరికలకు బీజేపీ నాయకత్వం ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది.

ఈనెల 9న ఢిల్లీ వేదికగా చేరికలకు BJP నాయకత్వం ప్లాన్

హైదరాబాద్: డిసెంబర్ 9న ఢిల్లీ వేదికగా చేరికలకు  బీజేపీ నాయకత్వం ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు విఠల్ బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. విఠల్‌తో పాటు మరికొందికి కషాయ కండువా కప్పే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. విఠల్‌తో పాటు తీన్మార్ మల్లన్నకు కాషాయ కండువా కప్పించేలా ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రయత్నాలు చేపట్టారు. ఉద్యమకారులతో ఎమ్మెల్యే ఈటల, శానసమండలి మాజీ ఛైర్మన్ స్వామీ గౌడ్ సంప్రదింపులు జరుగుతున్నాయి.  అప్పటి కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-02T14:39:31+05:30 IST