తెలంగాణలోని లోక్సభ స్థానాలను క్లస్టర్లుగా విభజించిన బీజేపీ
ABN , First Publish Date - 2022-07-05T21:54:58+05:30 IST
తెలంగాణలోని లోక్సభ స్థానాలను క్లస్టర్లుగా బీజేపీ విభజించించింది. 3, 4 లోక్సభ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసింది.
హైదరాబాద్: తెలంగాణలోని లోక్సభ స్థానాలను క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. 3, 4 లోక్సభ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసింది. క్లస్టర్ ఇంచార్జ్లుగా కేంద్రమంత్రులకు బాధ్యతలు అప్పగించింంది. హైదరాబాద్ క్లస్టర్ ఇంచార్జ్గా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, వరంగల్ క్లస్టర్ ఇంచార్జ్గా కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్, ఆదిలాబాద్ క్లస్టర్ ఇంచార్జ్గా కేంద్రమంత్రి పురుషోత్తమ్, జహీరాబాద్ క్లస్టర్ ఇంచార్జ్గా కేంద్రమంత్రి నిర్మల, మహబూబ్నగర్ క్లస్టర్ ఇంచార్జ్గా మహేంద్రనాథ్ పాండేలకు బాధ్యతలు అప్పగించింది.