హైదరాబాద్‎లో బీజేపీ జాతీయ సమావేశాలు..ఇప్పటి నుంచే ముమ్మర ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-06-23T23:51:10+05:30 IST

తెలంగాణ (Telangana)పై బీజేపీ (Bjp) జాతీయ నాయకులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ (Hyderabad), దుబ్బాక (Dubbaka), హుజూరాబాద్ (Huzurabad) గెలుపుతో బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై ..

హైదరాబాద్‎లో బీజేపీ జాతీయ సమావేశాలు..ఇప్పటి నుంచే ముమ్మర ఏర్పాట్లు

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana)పై బీజేపీ (Bjp) జాతీయ నాయకులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ (Hyderabad), దుబ్బాక (Dubbaka), హుజూరాబాద్ (Huzurabad) గెలుపుతో బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై ఫోకస్ (Focus) చేశారు. 2019లో ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‎లో జులై 2,3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ (Pm Modi)తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda), తదితర నాయకులు పాల్గొననున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు.. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదిక పంపుతున్నారు. 


ఈనెల 30నే హైదరాబాద్‌కు జేపీ నడ్డా

ఇక ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 30నే హైదరాబాద్ రానున్నారు. జులై 1న హెచ్ఐసీసీ (Hicc)లో పార్టీ కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశంకానున్నారు.  జులై 2,3న జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ కూడా పాల్గొననున్నారు. అనంతరం జులై 3వ తేదీ సాయంత్రం 4గంటలకు పరేడ్ గ్రౌండ్స్‎లో నిర్వహించే భారీ బహిరంగ సభకు  ప్రధాని మోదీ హాజరవుతారు. తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా నేతలు వివిధ తీర్మానాలకు ఆమోదం తెలపనున్నారు. 

Updated Date - 2022-06-23T23:51:10+05:30 IST