విజయవాడ: గుడివాడ బయల్దేరిన బీజేపీ బృందం
ABN , First Publish Date - 2022-01-25T18:57:02+05:30 IST
విజయవాడ: బీజేపీ బృందం గుడివాడకు బయల్దేరింది.
విజయవాడ: బీజేపీ బృందం గుడివాడకు బయల్దేరింది. ఈ బృందంలో సోమువీర్రాజు, సీఎం రమేష్, మాధవ్, నారాయణరెడ్డి తదితర నేతలు ఉన్నారు. సంక్రాంతి సంబరాల ముగింపుకు గుడివాడ వెళ్తున్నామమని నేతలు తెలిపారు. కాగా ముగింపు ఉత్సవాలకు అనుమతి లేదంటూ.. కళ్యాణ మండపాన్ని పోలీసులు తిరస్కరించారు. గుడివాడ కేసినో ఘటనపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు.
కాగా గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలు నిర్వహించి తీరుతామని సోమువీర్రాజు స్పష్టం చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, ధర్మం, సంస్కృతిని చూపిస్తామని అన్నారు. సగం వస్త్రాలు కట్టుకున్న చీర్గార్ల్స్ను తీసుకురామని, గడ్డం వ్యక్తుల దగ్గర అర్ధనగ్నంగా ఎగురుతున్నారని సోమువీర్రాజు విమర్శించారు. ధర్మం అంటే గడ్డాలు పెంచుకోవడం, చేతులకు తాళ్లు కట్టుకోవడం కాదన్నారు. బట్టలు ఎలా ధరించాలో దేవుడికి కట్టే వస్త్రాలను చూసి నేర్చుకోండని సోమువీర్రాజు సూచించారు. పొడుగ్గా ఉండే గడ్డం వ్యక్తికి ధర్మం అంటే భయమని, అందుకే గుడివాడ వస్తున్నామని సోమువీర్రాజు అన్నారు.