Chennai: నేను సాధారణ రైతును
ABN , First Publish Date - 2021-10-28T13:45:22+05:30 IST
తాను సాధారణ రైతునని, తన వద్ద కొన్ని మేకలే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొద్దిరోజుల కిత్రం పీజీఆర్ ఎనర్జీ సంస్థకు తమిళనాడు విద్యుత్ బోర్డు పలు రాయితీలు అందజేసిందని
- Bjp రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
పెరంబూర్(Chennai): తాను సాధారణ రైతునని, తన వద్ద కొన్ని మేకలే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొద్దిరోజుల కిత్రం పీజీఆర్ ఎనర్జీ సంస్థకు తమిళనాడు విద్యుత్ బోర్డు పలు రాయితీలు అందజేసిందని ఆరోపించిన అన్నామలై, అందుకు సంబంధించి పలు దస్తావేజులు బయటపెట్టారు. ఈ ఆరోపణలను విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఖండించడంతో పాటు ఆరోపణలు రుజువుకాకపోతే 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని అన్నామలైకు అల్టిమేటం ఇచ్చారు. ఈ నేపథ్యంలో, సంబంధిత పీజీఆర్ సంస్థ అన్నామలైకు పంపిన నోటీసులో, ఒక వారంలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అసత్య ఆరోపణలు చేసిందుకు రూ.500 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ఈ నోటీసుపై తన ట్విట్టర్లో స్పందించిన అన్నామలై, సార్, రూ.500 కోట్లకు నోటీసులు పంపారని, తాను ఒక సాధారణ రైతునని, తన వద్ద కొన్ని మేకలు మాత్రమే ఉన్నాయని, అరివాలయ మంత్రులుగా అవినీతికి పాల్పడడం లేదని, తనకు న్యాయస్థానంపై నమ్మకం వుందని ట్వీట్ చేశారు.