అధికారం చేపట్టేలా పనిచేద్దాం

ABN , First Publish Date - 2020-09-30T10:31:27+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ అధికారం దక్కేలా ప్రతీ కార్య కర్త పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఉమామహేశ్వరి ..

అధికారం చేపట్టేలా పనిచేద్దాం

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరి


బొబ్బిలి, సెప్టెంబరు 29 : రాష్ట్రంలో బీజేపీ అధికారం దక్కేలా ప్రతీ కార్య కర్త పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఉమామహేశ్వరి పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం బొబ్బిలి నియోజక వర్గ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి పెద్దింటి జగన్మో హనరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పార్టీ పై ప్రజల ఆదరణ పెరుగుతుందని, ఈ పరిస్థితుల్లో మరింత కష్టపడాలన్నా రు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని మాట్లాడుతూ ప్రధాని మోదీ విప్లవాత్మ కమైన సంస్కరణలు చేపడుతున్నారని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.


సమావేశంలో రైల్వేబోర్డు సభ్యుడు రామస్వామినాయుడు (రామ్‌జీ), పార్టీ నాయకులు పుల్లెల శ్రీనివాసరావు, కిసాన్‌ మోర్చా నాయకుడు సాలా అశోక్‌, బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల పార్టీ అధ్యక్షు లు ఎం.రామారావు, బండి సత్యనారాయణ, తాడుతూరి వెంకటరావు, బొమ్మరిల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ నెల్లిమర్ల : గ్రామస్థాయిలో బీజేపీ పటిష్టానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా పరిశీలకురాలు ఎస్‌.ఉమామహేశ్వరి అన్నారు. బీజేపీ ఓబీసీ విభాగం నాయకుడు దంతినాడ అప్పలాచారి అధ్యక్షతన నెల్లిమర్లలో మంగళవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని మాట్లాడుతూ బూత్‌ కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు హర్‌నాథ్‌, రాజేష్‌, పిన్నింటి వాసు, మహిళా మోర్చా నాయకురాలు కనకమహాలక్ష్మి,  నాగేశ్వరరావు, నడిపేన నారాయణమూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2020-09-30T10:31:27+05:30 IST