కమ్యూనిస్టులకు ఆ స్థాయిందా?: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-10-01T22:19:18+05:30 IST

సీపీఐ నారాయణ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. ‘బాబ్రీ మసీదు కూల్చివేతలో ఆడ్వాణీ, జోషి కుట్ర

కమ్యూనిస్టులకు ఆ స్థాయిందా?: సోము వీర్రాజు

అమరావతి: సీపీఐ నారాయణ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. ‘బాబ్రీ మసీదు కూల్చివేతలో ఆడ్వాణీ, జోషి కుట్ర చేశారనడం సరికాదు. హిందువులకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసే కమ్యూనిస్టులకు ఈ తీర్పు రుచించదు. పవన్‌కల్యాణ్.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శించే హక్కు మీకు లేదు. కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోని పార్టీ దేశంలో ఏదైనా ఉందా? కాంగ్రెస్, ఎన్టీఆర్, చంద్రబాబులతో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోలేదా? పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వాన్ని.. నిబద్ధతను ప్రశ్నించే ముందు మీరు గతంలో ఆయనతో పొత్తు పెట్టుకున్న విషయం మరిచారా?’ అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Updated Date - 2020-10-01T22:19:18+05:30 IST